తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదట!
posted on Jun 5, 2014 3:31PM
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా గురువారం నాడు బాధ్యతలు తీసుకున్న నాయని నర్సింహారెడ్డి మావోయిస్టుల విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ విని నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో అర్థంకాని స్థితికి ప్రజలు చేరుకున్నారు. నాయిని అంచనా ప్రకారం తెలంగాణలో మావోయిస్టుల సమస్య అస్సలు లేదట. ఈ సందర్భంగా తెలంగాణ భద్రత గురించి ఆయనేమన్నారంటే...
1. హైదరాబాద్ భద్రతకు పెద్దపీట వేస్తాం.
2. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తాం.
3. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం.
4. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తాం.
5. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తాం.
6. హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం.
7. కేసుల సత్వర పరిష్కారానికి సీఐడీని బలోపేతం చేస్తాం.