తలలో దిగిన బుల్లెట్: నేవీ ఉద్యోగి మృతి

 

విశాఖపట్టణంలో ఒక మిస్టీరియస్ డెత్ జరిగింది. ఐఎన్ఎస్ కళింగలో నివసించే వీరేంద్ర అనే పాతికేళ్ళ యువ ఉద్యోగి అనుమానాస్పదంగా మరణించాడు. ఆయన తలపై పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పేలడంతో తలలోంచి బుల్లెట్ దూసుకుపోయి ఆయన మరణించారు. తలమీద బుల్లెట్ గాయంతో వున్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్ళగా ఆయన అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ కావడం వల్లే మరణించారని నేవీ అధికారులు చెబుతున్నారు.