దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం..

 

దేశానికి తాము రక్షణ ఇవ్వగలమని.. హామీ ఇస్తున్నామని నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా తెలిపారు. ఈరోజు నేవీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత నావికా దళం ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని.. భారత తీర ప్రాంతాల రక్షణకు తమ దళం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి శత్రువుల వ్యూహప్రతివ్యూహాలనైనాన సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా, వైమానిక దళ చీఫ్‌ అరూప్‌ రహా ఢిల్లీలో అమర జవానుల జ్యోతికి నివాళులు అర్పించారు. అనంతరం ఢిల్లీలోని పాఠశాల చిన్నారులతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు.