మీ కారుకు పదేళ్లు నిండాయా ..అయితే షెడ్డుకే..!

నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. అవి సత్ఫాలితాల్ని ఇవ్వడంతో దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు కూడా ఇదే ఫార్మూలాని ఫాలో అవ్వాలని డిసైడయ్యాయి. కేరళలోని ఎర్నాకులంకు చెందిన లాయర్స్ ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్ ఫోరమ్ అనే సంస్థ కాలుష్యానికి కారణమవుతున్న కార్లపై చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఎర్నాకులం బెంచిలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్లు దాటిన నెల రోజుల తర్వాత కూడా అలాగే వాహనాలను నడుపుతుంటే రూ.10 వేల జరిమానా విధించాలని కూడా ఆదేశించారు.