హైదరాబాద్ చేరుకున్న మోడి
posted on Aug 11, 2013 10:51AM
బిజెపి పార్టీ ఎన్నికల రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి. కృష్ణంరాజులతోపాటు పలువురు ప్రముఖులు మోడీకి స్వాగతం పలికారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొననున్నారు.
కాసేపు పార్క్ హాయత్ హోటల్ లో బస చేయనున్న ఆయన పలువురు పారీశ్రామిక,సినీ, విద్యా రంగ నిపుణులతో సమాశేం కానున్నారు. తరువాత ఎల్ బి స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత ఓ స్కూల్ ఆవరణలోని సర్దార్ వల్లాబాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఎన్నికల సారథిగా ఎంపిక అయిన తరువాత తన తొలి ఎన్నికల ప్రచారాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభిస్తున్నారు మోడి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో పాల్గొనున్నారు. ఈ సభ వేదిక నుంచి మోడి చేసే ప్రసంగం కోసం యావత్ భారతం ఉత్కంటగా ఎదురు చూస్తుంది.