2019లోనూ హిందూపురం నుంచే-బాలయ్య

2019లోనూ తాను హిందూపురం నుంచే పోటి చేస్తానన్నారు..ప్రస్తుత ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ. హిందూపురంలోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల పట్ల తాను ఆవేదన చెందినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని..ఆవేదన అనేది తన రక్తంలోనే లేదన్నారు. వచ్చ ఎన్నికల్లో తాను గుడివాడ, మైలవరం నుంచి పోటీ చేస్తారన్న వార్తల్లో నిజం లేదన్నారు. హిందూపురం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని..రూ.198 కోట్లతో హంద్రీనీవా నుంచి పైపులైన్లు వేసి ఐదు నెలల్లోగా నీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.