బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

 

మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ పదవి ద్వారా డీకే అరుణ తెలంగాణలో ఏ గోడౌన్‌లోనైనా తనిఖీలు చేయొచ్చు ఆహార ధాన్యాల నాణ్యత పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి  లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణ కృతజ్ఞతలు తెలియజేశారు. 

రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం నా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ బాధ్యత ద్వారా తెలంగాణలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను, అని ఆమె పేర్కొన్నారు. కాగా డీకే అరుణ స్వస్థలమైన గద్వాల పట్టణంలో ఈ నియామకం సందర్భంగా ఆమె అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.