రొట్టెల పండుగలో మంత్రి నారాలోకేష్
posted on Jul 7, 2025 11:16PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లు నారా లోకేష్ చెప్పారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మతసామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందిన బారాషాహీద్ మసీదులో జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివస్తారు. స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకుంటారు.