చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!!

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో ఏపీ అధికార పార్టీ వైసీపీ కలవబోతున్నదని, మెగాస్టార్ చిరంజీవి వైసీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని అన్నారు. తాము బీజేపీకి దగ్గరగా లేమని, అలాగని దూరంగానూ లేమని తెలిపారు. రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ పని చేసేందుకు తమ అధినేత జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇక చిరంజీవి పార్టీలో చేరే విషయమై మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది చిరంజీవి ఇష్టమని, ఒకవేళ ఆయన చేరితే మాత్రం సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని బొత్స చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu