విజయమ్మకు మమత ఫోన్
posted on Jul 8, 2013 10:26AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయి నేతల కన్ను పడింది. తమతో కలవాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మతో ఫోన్లో మాట్లాడారు. 2014 జాతీయ ఎన్నికలు ముందుగా వచ్చేలా ఉన్నాయని చెప్పారట. అంతేకాదు.. తమతో పాటు కలిసి నడిస్తే మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మద్దతు కోరినట్టు సమాచారం. దీని గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. “జాతీయ స్థాయి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా వాటిని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుంది. మేము కీలక పాత్ర పోషించాలని మమత ఆశిస్తున్నారు” అని చెప్పారు. జగన్ తో మాట్లాడిన అనంతరం ఈ విషయంపై పార్టీ ఒక అండర్ స్టాండింగ్ కు వస్తుందని ఆ తర్వాత మమతకు విజయమ్మ తమ మద్దతు ప్రకటించే విషయమై మాట్లాడతారని ఆ నేతలు తెలిపారు.