మహాకూటమి చర్చలకు అమావాస్య అడ్డు

 

సాధారణంగా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అంతా మంచి రోజు మంచి మూహూర్తం చూసుకొని మొదలు పెడతారు.అమావాస్య రోజు ఏ పని ప్రారంభించినా అది ముందుకు సాగదు అని అందరూ విశ్వసిస్తారు.అందుకేనేమో ఈ రోజు జరగాల్సిన మహాకూటమి చర్చని కూడా వాయిదా వేసుకున్నాయి కాంగ్రెస్,తెదేపా,సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు.తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవ్వాల్సిన నేపధ్యంలో అమావాస్య కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.