భూముల ధరలు పెంచుతారా? వద్దు: చంద్రబాబు

 

ఆర్థిక ఇబ్బందులలో వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక వనరుల కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు ఈ సూత్రాన్ని గ్రహించకుండా భూముల విలువ పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా బోలెడంత డబ్బు వస్తుందని భావించారు. అనుకున్న తడవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల విలువను 30 శాతం పెంచుతూ ప్రతిపాదనలు తయారు చేసి ఫైలును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెట్టారు. అయితే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. ఈ ఫైలు మీద రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి ఇప్పటికే సంతకం చేశారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తిరస్కరించారు. ఇప్పుడు భూముల విలువ పెంచడం వల్ల ప్రజల మీద భారం పడటంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని చంద్రబాబు అధికారులకు చెప్పారని తెలుస్తోంది.