అళగిరి మీద కబ్జా కేసు

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధికి ఈ వయసులో ఆయన పెద్ద కుమారుడు అళగిరి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. పార్టీలో పెద్ద న్యూసెన్స్‌గా మారిన ఆయన ఈ మధ్య కరుణానిధి రెండో కుమారుడు స్టాలిన్ త్వరలో చనిపోతాడన్నట్టుగా కామెంట్లు చేశాడు. దాంతో కరుణానిధి మనసు కష్టపడి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా అళగిరి మరో తలనొప్పిని తెచ్చిపెట్టాడు. మదురైలో అళగిరికి ఓ కాలేజీ వుంది. ఆ కాలేజీ పక్కన వున్న 44 సెంట్ల భూమిని ఆక్రమించేశాడు. దాంతో ఆ భూమి యజమానులు అళగిరి మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అళగిరిని అరెస్టు కూడా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే, అళగిరి మీద చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. అళగిరికి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.