సియం కిర‌ణ్ ద‌ద్దమ్మ

 

స‌మైక్య వాదుల‌పై కె సి ఆర్ త‌న‌యుడు కెటిఆర్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌కు అండ‌గా ఉంటున్నార‌న్న నెపంతో సియం కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి కావూరి సాంబ‌శివ‌రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుల‌పై తీవ్రవిమ‌ర్శలు చేశారు. కెసిఆర్ బ‌హిరంగ స‌వాల్ విసిరితే దానికి క‌నీసం స్పందించ‌ని కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఓ దద్దమ్మ అన్నారు.

తెలంగాణ విభ‌జ‌న‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్రక‌టించిన చంద్రబాబు ఇప్పుడు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు కెటిఆర్‌. త‌ను గ‌తంలో తీసుకున్న నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉన్నట్లయితే హరికృష్ణ, ప‌య్యావుల కేశ‌వుల‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌న్నారు.

హైద‌రాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాల‌న్న కావూరి వ్యాఖ్యల‌పై స్పందిస్తూ హైద‌రాబాద్ పై పేచీ పెడితే స‌హించ‌మ‌న్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ త‌న ఇం టి అంశం గా చూస్తుంద‌ని, హైద‌రాబాద్ కావూరి లాంటి వాళ్ల జాగీర్ కాద‌న్నారు. సీమాంద్ర ప్రాంతం వారు క‌లిసి ఉండాలంటున్నారు కానీ తెలంగాణ భ‌క్తుల‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్రశ్నించారు.