అమెరికాలోని తెలుగువారికి అండగా ఉంటాం-కేటీఆర్

అమెరికాలోని తెలుగువారిపై అక్కడి పౌరులు చేస్తోన్న జాత్యహంకార దాడులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంశీ, శ్రీనివాస్, కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హమీ ఇచ్చారు. దీనిపై విదేశాంగ శాఖతో చర్చిస్తామని తెలిపారు. గత 15 రోజుల వ్యవధిలో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మరణించారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి, గత బుధవారం కూచిబోట్ల శ్రీనివాస్ దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.