రెచ్చగొట్టేందుకే జగన్ సభ

 

 

 

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభ పెడుతున్నాడని కొండా సురేఖ దంపతులు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పేరుతో రెచ్చగొడితే రెచ్చిపోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా హైదరాబాదులో సమైక్య సభ పెట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వస్తుందన్న నమ్మకం తమకు ఉందని సురేఖ దంపతులు విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ తెలంగాణపై యూ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఆగ్రహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి కిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.