సమైక్యాంద్ర కోసం సియం పాదయాత్ర..?
posted on Sep 10, 2013 11:34AM
ఆత్మగౌరవ యాత్రతో చంద్రబాబు, సమైక్య శంఖారావంతో షర్మిలలు వాళ్ల వాళ్ల పార్టీలకు మైలేజ్ పెంచుతుంటే ఇప్పుడు కిరణ్కుమార్ రెడ్డి కూడా అదే ఆలోచనలో పడ్డాడు. తన కూడా ఏదో ఓ యాత్ర చేపట్టి సీమాంద్రలో పార్టీ పరువు కాపాడాలనుకుంటున్నాడు.
ఇప్పటికే పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్న కిరణ్ ఆ విషయాన్ని పలువురు సీనియర్ మంత్రుల ముందు కూడా ప్రస్తావించారట. అయితే దాదాపు అందరు మంత్రులు కిరణ్ పాదయాత్ర ఆలొచనకు మద్దతు తెలుపగా కొంతమంది మంత్రులు మాత్రం వ్యతిరేఖించారట.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో ముఖ్యమంత్రి కూడా గాగమే కనుక సియం పాదయాత్ర చేయటం వల్ల పెద్దగా ఒరిగేదేమి లేకపోగా జనాలనుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు కొందరు మంత్రులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సియం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.