రాజభోగం... 20మంది మహిళలతో!

'రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా?' అని సామెత. అలాగే, రాజు తలచుకోవాలని కానీ సపర్యలు చేసే చెలికత్తెలకు కొరత ఉండదు. థాయ్‌ల్యాండ్ రాజు మహా వజ్రలాంగ్ కార్న్ అదే పని చేశాడు. తనతో పాటు 20 మంది మహిళలను వెంటబెట్టుకుని జర్మనీలోని స్టార్ హోటల్ కి వెళ్లాడు. కరోనా క్రైసిస్ టైమ్‌లోనూ రాజ భోగాలను వదులుకోవడానికి ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. అసలు, ఉన్నట్టుండి రాజుగారు థాయ్‌ల్యాండ్ వదలి, జర్మనీ వెళ్లడానికి కారణం కూడా కరోనాయే. ఎక్కడ కరోనా తనకు సోకుతుందేమోననే భయంతో సొంత దేశం వదిలి వెళ్లిపోయాడు. జర్మనీలో ఫోర్ స్టార్ హోటల్ మొత్తాన్నీ ఒక్కడే బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే ఈ వార్త బయటకొచ్చింది. అయితే... అందులో 20మంది మహిళలు, కొంతమంది సేవకులతో దిగినట్టు జర్మనీ పత్రికలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అన్నట్టు రాజుగారికి నలుగురు భార్యలు. ప్రస్తుతం వాళ్లు రాజుతో ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకు థాయ్‌ల్యాండ్‌లో 1500లకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.