పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోంది..
posted on Nov 17, 2016 9:24AM
భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కూడా పాక్ పలు మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఈ కాల్పుల్లో భారతసైన్యాన్ని హతమార్చామని పాక్ చెబుతున్న మాటలను భారత్ ఖండిస్తుంది. కాల్పుల్లో 11 మంది భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించిన భారత్..పాకిస్థాన్ పచ్చి అబద్ధాలు చెబుతోందనికాల్పుల్లో ఎవరూ పెద్దగా గాయపడలేదని నార్త్ రన్ కమాండ్ పేర్కొంది. 14న భారత పోస్టులపై దాడులు చేసి 11 మందిని చంపామనడం అవాస్తవమని తెలిపింది.
కాగా నిన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మేనేజర్ రహీల్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు అమరవీరులయ్యారని, ప్రతిగా పాక్ చేసిన దాడిలో 11 మంది హతమయ్యారని చెప్పిన సంగతి తెలిసిందే.