ఈ రోజు కేశవ్ రావ్ జీవితంలో బ్లాక్ డే



ఈ రోజు సాయంత్రం తెరాసలో జేరనున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవ్ రావ్ ఇది తన రాజకీయ జీవితంలో ‘బ్లాక్ డే’ అని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో ఏర్పరుచుకొన్ననాలుగు దశబ్దాల అనుబంధం తెంచుకొని పార్టీని వీడవలసి వస్తున్నందుకు ఆయన ఆవిధంగా అన్నారు. సోనియా గాంధీ తనకు అన్ని పదవులు ఇచ్చి పార్టీలో సముచిత గౌరవం ఇచ్చారని, కానీ తానడిగిన ఒక్క తెలంగాణా మాత్రం ఈయలేకపోయారని ఆయన అన్నారు. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడినప్పటికీ, మంత్రి డీయల్ బర్త్ రఫ్ పై తీవ్రంగా స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి చాల అవమానకరంగా, రాజ్యాంగ విరుద్దంగా ఆయనను తొలగించారని, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి వేసే భిక్ష కాదని కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.