కెసిఆర్ కు భద్రత పెంపు

 

Kcr Telangana, Telangan Kcr, TRS apprehends threat to KCR

 

 

కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతోందని తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లు రెండు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొత్త బుల్లెట్ కారును సమకూర్చింది. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు స్క్వాడ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. స్థానిక ఎస్సై, ఎఆర్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుండి వచ్చిన ఎనిమిద మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.