హైదరాబాద్ ఆస్పత్రికి కేటీఆర్ : కిడ్నీ ఆపరేషన్

 

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస నేత కేటీఆర్ గురువార నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న కేటీఆర్‌కి సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు, ఆయనను తక్షణం హైదరాబాద్‌కి తీసుకెళ్ళాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. దాంతో ఆయన్ని శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన కిడ్నీలో భారీ స్థాయిలో వున్న రాళ్ళని గుర్తించారు. వాటి కారణంగానే కేటీఆర్ కడుపునొప్పితో బాధపడుతున్నారని తీర్మానించారు. నిపుణులైన వైద్యులు ఆయనకి శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో వున్న రాళ్ళని తొలగించారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్‌కి సూచించినట్టు తెలుస్తోంది.