అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడు.. ఎస్పీ


చిత్తూర్ మేయర్ అనురాధ, మోహన్ దంపతులు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడని పోలీసులు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య పదకొండని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా మరో నిందితుడు మురుగ కూడా టూ టౌన్ పీఎస్ లో లొంగిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. మురుగ మరెవరో కాదుని.. 47 వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి భర్త అని.. అనురాధను చంపడానికి స్కెచ్ వేయడంలో మురగదే కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది చింటూ, వెంకటా చలపతి అని.. ప్రధాన నిందితుడు చింటూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని..హత్యల వెనుక రాజకీయ కోణంపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.