హైకోర్టులో యడ్యూరప్పకు ఊరట.. పోక్సో కేసులో ట్రయల్ కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కర్నాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఈ కేసులో యడ్యూరప్ప వ్యక్తిగతంలో ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.

 గత ఏడాది మార్చిలో యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు ఆయనతో సహా మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్ల మేరకు వీరు శుక్రవారం (మార్చి 15) ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ట్రయల్ కోర్టు సమన్లను సవాల్ చేస్తూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు ట్రయల్ కోర్టు సమన్లపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా  ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తన 17 ఏ్ల కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి విదితమే.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu