బాబుగారికి భయం... జగన్ సార్ కి స్వార్ధం

ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ సంచలనం కామెంట్స్ చేసారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ఆ భయం తోనే ఏపీకి చెందిన వేల కోట్ల ఆస్తులను తెలంగాణ కు వదిలి పెట్టి కరకట్టకు వచ్చి చేరారని విమర్శించారు. అదే సమయం లో సీఎం జగన్ కూడా తన స్వార్ధ ప్రయోజనాల కోసం తెలంగాణ లోని ఏపీ ఆస్తుల పై నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. అసలు చట్టబద్దంగా తెలంగాణ నుండి ఏపీకి చెందాల్సిన ఆస్తుల పూర్తి వివరాలు ప్రకటించాలని కన్నా డిమాండ్ చేసారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా ఆయన ఈ ట్వీట్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోటోలని పోస్ట్ చేసారు.