క్షీణించిన కన్నయ్య కుమార్ ఆరోగ్యం..

 

ఢిల్లీ జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ తమపై విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కన్నయ్య కుమార్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న కన్నయ్యకు నిన్న ఉన్నట్టుండి వాంతులు అవడంతో అతనిని జేఎన్యూలోని మెడికల్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ అతనిని పరీక్షించిన వైద్యులు కన్నయ్య ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని.. అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కాగా కన్నయ్య ఏప్రిల్‌ 28న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అతనితో పాటు మరో 25 మంది విద్యార్దులు కూడా అతనితో పాటు దీక్షలో పాల్గొన్నారు.