కన్నయ్య కుమార్ ను చంపేస్తాం.. బస్సులో తుపాకీ, ఒకలేఖ

 

జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ రోజు రోజుకి ఎంత పాపులర్ అవుతున్నాడో.. అదే విధంగా ఆయనకు సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. అంతకు ముందు పెద్దగా ఎవరికి తెలియని కన్నయ్య కుమార్ జెఎన్యూ ఘటన తరువాత మాత్రం దేశవ్యాప్తంగా నోటెట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయనకు తెలత్తుతున్న సమస్యలకు గాను కేంద్రం ఆయనకు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మరో ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ నుంచి జేఎన్యూ మధ్య నడిచే బస్సులో పోలీసులు ఓ అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. దీనిని తెరచి చూసిన పోలీసులు అందులో తుపాకీ, ఒకలేఖను గుర్తించారు. ఆ లేఖలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ ను హత్యచేస్తామని పేర్కొనడంతో కలకలం రేగుతోంది. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.