సోనియాని జైపాల్ ఎందుకు కలిశారు?

 

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ తెర ముందు కనిపించని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేంద్రం తెలంగాణ విభజన ప్రకటన చేసిన తరువాత చురుకుగా ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ సభల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. దాంతో పాటు ఢిల్లీలో తెలంగాణ గురించి కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసి నివేదిక సమర్పించాడు. అయితే తాజాగా రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో ఆయన ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఒవైసీతో బేటీ తర్వాత, రాయలతెలంగాణపై ఐబీ విచారణ, ఇప్పుడు జైపాల్‌తో భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది.