హలో దేవినేని గారు...నేను జగన్ మాట్లాడుతున్నా

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసారు. అసెంబ్లీలో విమర్శలు గుప్పించినట్లుగా మళ్ళీ విమర్శించడానికో లేకపోతే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికో మాత్రం కాదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగు పనులు పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేయడం కోసమట. గండికోట ముంపు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనుక వారి సమస్యలు పరిష్కరించమని కోరారు. అదే చేత్తో పులివెందుల బ్రాంచి కెనాల్ కు తాగు నీరు,సాగునీరు విడుదల చేయాలని జగన్ కోరారు. ప్రతిపక్ష నాయకుడు ఈవిదంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తే అందరూ హర్షిస్తారు.