వైఎస్ జగన్ ఐదు సంతకాల గుట్టు ఇదే

 

 

 

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాను సీమాంధ్రకి ముఖ్యమంత్రి అయిపోతానని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు సంతకాలు చేస్తానని చెబుతూ వస్తున్నారు. ఆ ఐదు సంతకాలు గుట్టును తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. ఒకవేళ జగన్ పొరపాటుగా సీఎం అయితే ఆయన సంతకాలు చేయాలనుకుంటున్న ఫైళ్ళేమిటో యనమల చెప్పారు.

 

సంతకం నంబర్ 1 :  తనకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి  థాంక్స్ చెప్పడంలో భాగంగా కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యే ఒప్పందం మీద.

సంతకం నంబర్ 2: సీబీఐ దాఖలు చేసిన కేసులు, చార్జిషీట్లు తదితరాలను టాంపరింగ్ చేసే ఆదేశాల మీద.

సంతకం నంబర్ 3: తాను స్థాపించిన బినామీ కంపెనీలు, సాక్షి మీడియాకు అదనపు రాయితీలు ఇచ్చే ఫైలు మీద.

సంతకం నంబర్ 4:  తన తండ్రి లాక్కున్న 89 వేల ఎకరాల దళిత భూములతోపాటు, ఇంకా లక్షా 50 వేల ఎకరాల అసైన్డ్ భూమిని తన బినామీలకు కట్టబట్టే ఫైల్.

సంతకం నంబర్ 5: తండ్రిని అడ్డు పెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు, భవంతులను క్రమబద్ధీకరించే ఆదేశాల మీద.