ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్రకుమార్ దారుణ హత్య..

 

పొరుగు దేశాల్లో, పొరుగు రాష్ట్రాల్లో మన తెలుగు వారు హత్యకు గురవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఇప్పటికి ఎన్నో చూశాం. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరులో చోటుచేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్రకుమార్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆయనను కాల్చి చంపారు. అయితే, ఈ హత్య వెనుక ఆయన పాత మేనేజర్ హస్తం ఉండవచ్చని..పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియలెస్టేట్ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంతో పాటు, పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ ను కూడా సురేంద్ర కుమార్ నిర్వహిస్తున్నారు.