భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 319 ర‌న్స్..

 

రాజ్ కోట్ లో భారత్-ఇంగ్లడ్ ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ నాలుగు వికెట్ల నష్టానికి 319 ర‌న్స్ చేసింది. ఇక టాపార్డ‌ర్‌లో పుజారా, విజ‌య్‌లు సెంచ‌రీలు చేసి ఔట‌య్యారు. పుజారా 124, విజ‌య్ 126 ర‌న్స్ చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ కోహ్లీ 26 ప‌రుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం భార‌త్ మ‌రో 218 ప‌రుగులు వెనుక‌బడి ఉంది. ఇంకా రెండు రోజుల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో తొలి టెస్ట్ డ్రా దిశ‌గా వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.