హైదరాబాద్ లో కేబుల్ ప్రసారాలు బంద్

అక్టోబర్ ఏడున హైదరాబాద్లో కేబుల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది, డిజిటలైజేషన్ కు వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లంతా ఒకరోజు బంద్ పాటించాలని నిర్ణయించడంతో కేబుల్ ప్రసారాలు రాకపోవచ్చని తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జితేందర్ ప్రకటించారు, డిజిటలైజేషన్ పేరుతో కేబుల్ ఆపరేటర్లపైనా, వినియోగదారులపైనా భారం మోపుతున్నారని, డిజిటలైజేషన్ అయితే వినియోగదారుడు అన్ని పన్నులతో కలిపి 600 రూపాయల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని జితేందర్ అంటున్నారు, డిజిటలైజేషన్ కు తాము వ్యతిరేకం కాకపోయినా, ఎంఎస్వోలు రేట్లు పెంచాలని తమపై ఒత్తిడి పెంచుతున్నారని, దాంతో వినియోగదారులపైనే చివరికి భారం పడనుందని చెబుతున్నారు,  అక్టోబర్ ఏడున ఉదయం 6గంటల నుంచి 24గంటలపాటు బంద్ ను పాటిస్తామని, దీనికి హైదరాబాదీలు సహకరించాలని కేబుల్ ఆపరేటర్లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.