వర్ష భీభత్సం... మరో రెండు రోజులు

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం సంభవిచడం వల్ల రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల భవనాలు కూలిపోయి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ప‌శ్చిమ మ‌ధ్య‌ బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఆవ‌రించి ఉంద‌ని అధికారులు చెప్పారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.