ఆ రాజ్యసభ అభ్యర్దిపై 28 క్రిమిన‌ల్ కేసులు..


బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించిన వారిలో గోపాల్ నారాయణ్ సింగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రం నుండి ఈయన రాజ్యసభకు ప్రాతినిద్యం వహించనున్నారు. అయితే బీజేపీ నారాయణ సింగ్ ను ఎన్నుకోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర అధికార పార్టీ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పలు విమర్శలు గుప్పిస్తోంది. ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 28 సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని..  పేర్కొంది. జేపీలో ఎంతో మంది అర్హులైన నేత‌లుండ‌గా గోపాల్ నారాయ‌ణ్ సింగ్ నే త‌మ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింద‌ని, దీంతో ఆ పార్టీ దారులు ఎటుగా ఉన్నాయో.. వారి దృక్ప‌థం ఎలాగుందో తెలుస్తోంద‌ని అంటున్నారు.