ఏపీలో రైలు ప్రమాదం.. నాలుగు ట్యాంకర్ బోగీలు దగ్ధం

కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల కోసం కేంద్రం కొన్ని శ్రామిక రైళ్లను నడుపుతోంది. ఐతే లాక్ డౌన్ టైం లో కూడా గూడ్స్ రైళ్లు పరుగెడుతూనే ఉన్నాయి. ఐతే తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా సురారెడ్డి పాలెం టంగుటూరు మధ్య ఒక వంతెన వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తపింది. దీంతో అందులోని ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు వంతెన పై నుండి కింద పడ్డాయి. దీంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే డివిజన్ అధికారులు, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐతే అప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం.