గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

 

బెంగుళూరు నుంచి గౌహతి వెళ్ళే ఎక్స్‌ప్రెస్ ఆహుతి అయిపోయేదే. అయితే ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సోమవారం నాడు గౌహతి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు జిల్లా దొరవాని సత్రం మండలం పోలిరెడ్డి పాలెం వద్దరకు రాగానే జనరల్ బోగీ బ్రేకుల దగ్గర మంటలు చెలరేగాయి. దాంతో ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. దాంతో రైలును నిలిపివేసి, రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. దాంతో రైలు యథావిధిగా పయనమైంది. ఈమధ్యకాలంలో ఈ ప్రాంతంలోనే ఒక గూడ్స్ రైల్లో కూడా మంటలు వ్యాపించి ఒక బోగీ మొత్తం కాలిపోయింది.