కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలోకి?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ టీడీపి తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయనకు ప్రశంసలు సంగతి దేవుడెరుగుకాని విమర్శలే ఎక్కువ మోశారు. దానికి తోడు అప్పుడే రాష్ట్రవిభజన జరగడం.. ఒకవైపు తాను సమైక్యాంధ్ర అంటూ ఉన్నా కాని రాష్ట్రం విడిపోవడంలో కేంద్రానికి సపోర్టు చేశారనే ప్రజలు తిట్టిపోసుకున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కిషోర్ కుమార్ అన్నీ తానై చూసుకునేవారు. తరువాత రాష్ట్రం విడిపోవడం ఆయన వేరే పార్టీ పెట్టడం జరిగాయి. అప్పుడు  పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచి  వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆతరువాత ఇద్దరూ దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కిషోర్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈవార్తల నేపథ్యంలో మరో వార్త షికారు చేస్తుంది.  తమ్ముడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారట. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.