మోడీకి ట్రంప్ ఫోన్...

 

ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. భారత్ ను నిజమైన మిత్ర దేశంగా ట్రంప్ అభివర్ణించారు. అదేవిధంగా ప్రాంతీయ భద్రతా సమస్యలపై కూడా మాట్లాడారు. భవిష్యత్ లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. కాగా సంభాషణలో భాగంగా భారత్‌లో పర్యటించాల్సిందిగా మోదీ..ట్రంప్‌ను కోరగా, అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ట్రంప్.. మోదీని ఆహ్వానించారు.