జైలుకు నిప్పు... 150మంది ఖైదీలు పరారు...

 

జైలుకు నిప్పంటించి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..బ్రెజిల్ లోని  సావోపోలో రాష్ట్రంలోని  బౌరు జైలులో ఖైదీల మధ్య ఏర్పడిన గొడవ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో  జైలు లో కొంత భాగానికి నిప్పుపెట్టారు. అనంతరం జైలు గోడల్ని బద్దలు కొట్టి  కనీసం 150మంది  ఖైదీలు పారిపోయారు. కఠినమైన క్రమశిక్షణ మూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారిలో 100 మందిని తిరిగి పట్టుకున్నట్టు  జైళ్ల శాఖ అధికారులు చెప్పారు.