మార్కండేయ కట్జూ మీద డీఎంకే మండిపాటు

 

అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం యూపీఏ భాగస్వామిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీ లాబీయింగ్ చేసిందని ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై డీఎంకే పార్టీ మండిపడింది. కట్జూ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని డీఎంకే స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం తమిళనాడుకు చెందిన పార్టీ లాబీయింగ్ చేసిందన్న ఆరోపణలన్ని అభూత కల్పనలు అని డీఎంకే నేతలు తెలిపారు. యుపీఏతో భాగస్వామిగా వున్న తమిళనాడు పార్టీ తమదే కాబట్టి తాము ఈ అంశంపై స్పందిస్తున్నామని డీఎంకే నేతలు అన్నారు. కట్లూ చేసి ఆరోపణల్ని డీఎంకే పట్టించుకోవడం లేదన్నారు. కట్జూ తమ పార్టీ పేరు చెప్పలేదని.. అంతేకాకుండా న్యాయమూర్తి పేరు కూడా ఆయన వెల్లడించలేదని డీఎంకే నేత టీకేఎస్ ఇళగోవన్ అన్నారు. మార్కండేయ కట్జూ వ్యాఖ్యల్ని డీఎంకే అధినేత కరుణానిధి దృష్టికి తీసుకువెళ్తామని ఇళగోవన్ తెలిపారు.