తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (మార్చి 20)ఉదయం శ్రీవారి దర్శనం కోసం టైమ్ స్లాట్ ఉన్న భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

అలాగే ఉచిత దర్శనం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మంగళవారం (మార్చి 19) శ్రీవారిని 63వేల 251 మంది దర్శించుకున్నారు. వారిలో  20,989 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 14లక్షల రూపాయలు వచ్చింది.