తిరుమల హుండీ ఆదాయం 3 కోట్ల 9లక్షలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మే9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (మే8) శ్రీవారిని మొత్తం 64 వేల 766 మంది దర్శించుకున్నారు.

వారిలో 24 వేల 158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.