బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ 

ఏపీ బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె కొద్ది రోజులుగా వైరస్ లక్షణాలతో బాధపడుతుండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే ఎక్కువగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆమెను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమెను అభినందించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.