ప్రేయసిని పెళ్ళి చేసుకున్న శ్రీశాంత్

 

 

 

పిక్సింగ్ నేరంపై జీవితకాల నిషేధాన్నిఎదుర్కొంటున్న ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓ ఇంటివాడయ్యాడు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన భువనేశ్వరీ కుమారిని ఈరోజు ఉదయం వివాహమాడారు. కేరళ హిందూ సంప్రదాయ ప్రకారం గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో వీరిద్దరూ ఒకటయ్యారు. వీరి వివాహానికి బంధువులతో పాటు కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. భువనేశ్వరీ కుమారి తో శ్రీశాంత్ కి గత కొంతకాలంగా పరిచయం ఉంది. శ్రీశాంత్ పిక్సింగ్ ఆరోపణలపై జైలుకు వెళ్ళినప్పుడు ఆమె అండగా నిలిచింది.