ఏపీలో కొత్తగా 796 కరోనా కేసులు.. ఒక్కరోజే 11 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 796 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. వారిలో స్థానికులు 740 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 51మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,285 కి చేరుకుంది. గడచిన 24 గంటలలో 11 మంది మరణించారు. దీంతో, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 157కి చేరింది. ఇప్పటివరకు 5,480 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 6,648 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.