ఆంధ్రప్రదేశ్ లో 87 పెరిగిన క‌రోనా పాజిటివ్ కేసులు!

మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87కు పెరిగింది. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది.  
జిల్లాల వారిగా కొత్తగా నమోదు అయిన కేసులు, చిత్తూరు - 5, ప్రకాశం - 4,   కృష్ణ - 1, తూర్పుగోదావరి - 2, కడప - 15, నెల్లూరు - 2, విశాఖపట్నం - 1, పశ్చిమగోదావరి - 13
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి చెందింది.