చేగూర్ గ్రామాన్ని తనికీ చేసిన కలెక్టర్ అమయ్ కుమార్


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం చేగూర్  గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్,  సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు సందర్శించారు. చేగూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ కరోనాతో నేడు ఉస్మానియా  ఆసుపత్రిలో మహిళ మృతి మరణించింది. అయితే ఆసుపత్రి రికార్డ్ లో ఈమె వయస్సు 55 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తరువాత పరీక్షల్లో కరోనా  పాజిటివ్ గా రిపోర్ట్ లోవచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ అమయ్ కుమార్ చేగూర్ గ్రామానికి కమీషనర్ సజ్జనార్ ఇతర అధికారులతో కలసి హుటాహుటిన చేరుకున్నారు.

మృతురాలి నివాసం,  పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావకపు మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. మృతురాలి తో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లో ఎవరెవరున్నారో వారిని గుర్తించి సిపార్డ్ లోని క్వారంటైన్ కేంద్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన వారిని తమ ఇళ్లలోనే క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అమయ్ కుమార్ తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్,  వైద్య,  ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.