విజృంభిస్తోన్న కరోనా.. ఏపీలో 82, భారత్ లో 8,171

ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఏపీలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా.. 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 3,200 అని పేర్కొంది. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 927 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,209 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

ఇక, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,171 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 204 మంది కరోనాతో మరణించారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకోగా.. ప్రస్తుతం 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.