కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నుమూత..

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జీవీ శేషు తుది శ్వాస విడిచారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన జీవీ శేషు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన జీవీ శేషు... ప్రకాశం జిల్లా డీసీసీ చీఫ్ గా పనిచేయడంతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ దఫా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగానూ ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.